నాగార్జునసాగర్‌కు సీఎం కేసీఆర్‌..

122
kcr ts cm
- Advertisement -

నేడు నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించనున్నారు. సాగర్ ఉప ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఇవ్వాళ నియోజకవర్గంలో పర్యటించి అభివృద్ధి పై ప్రగతి సమీక్ష చేయనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈ మేరకు నియోజకవర్గ కేంద్రమైన హాలియలో ని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ప్రగతి సమీక్ష సభ ను ఏర్పాటు చేశారు అధికారులు….ఈ సమావేశానికి నియోజకవర్గO లో ఉన్న 110 గ్రామాలకు చెందిన వార్డ్ మెంబర్లు, సర్పంచ్ లు, MPTC లు,ZPTC లు, MPP లు , మున్సిపాలిటీ ల కౌన్సిలర్ లు ,చైర్మన్ లు, అల్ MLA లు, MLC MP లను ఆహ్వానించారు.

వారందరికి ప్రత్యేకంగా పాస్ లను జారీ చేశారు… సాగర్ ఉప ఎన్నికల్లో TRS అభ్యర్థి నోముల భగత్ ను భారీ మెజారిటీతో గెలిపించిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆరే హామీల అమలుకు నియోజకవర్గానికి వస్తుండటంతో నియోజకవర్గ వ్యాప్తంగా సందడి నెలకొంది… గ్రామ గ్రామాణ ప్రగతి పండుగ ,సందడి నెలకొంది…తమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు వస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఘనంగా స్వాగతం పలికేందుకు సాగర్ నియోజకవర్గ ప్రజలు హాలియకు చేరుకుంటున్నారు… ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్ కు ఇరు వైపులా నిల్చొని పూలతో , డప్పు వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ఏర్పాట్లు చేసుకున్నారు… ఇందు కోసం అధికారులు సీఎం కాన్వాయ్ వెళ్లే రహదారికి ఇరు వైపులా ప్రజలు నిలుచొని ఉండేలా బారి ఖేడ్స్ ఏర్పాటు చేశారు… ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ ఉదయం 10 గంటల 40 నిమిషాలకు ప్రత్యేక హెలికాప్టర్ లో హాలియకు చేరుకుంటారు… అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ప్రగతి సమీక్ష సమావేశానికి చేరుకుంటారు.

అక్కడ మధ్యాహ్నం వంటి గంట వరకు అధికారులు లతో, ప్రజాప్రతినిధులు లతో నియోజకవర్గ ముఖ్య నాయకులతో ప్రగతి సమీక్ష నిర్వహిస్తారు… ఇప్పటికే నియోజకవర్గంలో కొనసాగుతున్న నెల్లికల్ లిఫ్ట్, కుంకుడు చెట్టు తండాలిఫ్ట్ ల పనుల పురోగతి పై ప్రత్యేకంగా చర్చిస్తారు.. ఇక వీటితో పాటు మిర్యాలగూడ, దేవరకొండ, హుజుర్నగర్, కోదాడ, సూర్యపేట, నకేరేకల్, తుంగతుర్తి నియోజకవర్గముల్లో నిర్మిస్తున్న మరో 12 లిఫ్ట్ ల పనులపై కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించనున్నారు.. ఈ మేరకు ఇరిగేషన్ అధికారులు నివేదికలు సిద్ధం చేశారు…..అక్కడికక్కడే నిర్ణయాలు తీసుకొని, నియోజకవర్గ అభివృద్ధి పై , లిఫ్ట్ ల నిర్మాణలపై అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు… ఇక సాగర్ నియోజకవర్గంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ భావన నిర్మాణం, చెక్ డ్యామ్ లు, బ్రిడ్జి లు, నాగార్జున సాగర్ లోని ఇళ్ల స్థలాల కేటాయింపు , గ్రామాలకు మంజూరు చేసిన స్పెషల్ డవలప్మెంట్ ఫండ్ వినియోగం,బుద్ధవనం, ఇలా అన్ని అంశాలపై కూలంకషంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష చేయనున్నారు.. జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి, TRS ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్ రావు, MLA భగత్ లు ఏర్పాట్లు దగ్గరుండి పూర్తి చేశారు.

- Advertisement -