BRS:మరోసారి మహారాష్ట్రకు కేసీఆర్

27
- Advertisement -

ఈ నెలాఖరులో ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరొకసారి మహారాష్ట్ర పర్యటించనున్నారు. అత్యంత ప్రజాదరణ కలిగిన దళితనేత, సామాజిక వేత్త అన్నాబావ్ సాఠే జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొంటారు. అక్కడి స్థానిక నేతలకు కండువా కప్పి బీఆర్ఎస్ లోకి ఆహ్వానిస్తారు. ఆ తరవాత కేసీఆర్ కొల్హాపూర్ మహాలక్ష్మి ఆలయాన్ని సందర్శించి అక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

ఆగస్టు 1 వ తేదీన మహారాష్ట్ర సాంగ్లీ జిల్లా వార్వా తహశీల్ వాటేగావ్ గ్రామంలో జరిగే అన్నాభౌ సాఠే 103 వ జయంతి ఉత్సవాల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొంటారు. మాతంగ సామాజికవర్గానికి చెందిన అన్నాబావ్ సాఠే అసలు పేరు తుకారాం బావురావ్ సాఠే. అన్నాబావ్ దళిత ఉద్యమ నాయకుడు, సామాజికవేత్త. స్వతహాగా కవి, రచయిత కూడా. సాఠే 35 కు పైగా నవలలు రాశారు. మరాఠా మాండలికంలో సాగిన సాఠే రచనల్లో ఫకీరా అత్యంత ప్రజాదరణ పొందింది. బ్రిటిష్ రాజ్ కు వ్యతిరేకంగా పోరాడిన ఒక యువకుని జీవనగాథ ఆధారంగా రూపొందిన ఫకీరాకు 1961 లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ నవల పురస్కారాన్ని పొందింది. రష్యాలోని మాస్కో నగరంలోని మార్గరీటా రుడోమినో అల్ రష్యా స్టేట్ అంతర్జాతీయ సాహిత్య గ్రంధాలయం దగ్గర లోక్షాహిర్ అన్నాబావ్ సాఠే విగ్రహాన్ని స్థాపించారు. అన్నాబావ్ సాఠే స్మృతి దివస్ లో పాల్గొన్న తరవాత బీఆర్ఎస్ అధినేత అక్కడి నాయకులకు కండువా కప్పి పార్టలోకి ఆహ్వానిస్తారు. ఆ తరవాత ఆయన సాంగ్లీ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొల్హాపూర్ కు చేరుకుంటారు.

Also Read:ఆలుతో కారు అద్దాలు క్లీన్!

కొల్హాపూర్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అక్కడ కొలువైన మహాలక్ష్మి ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సాధారణ శకం 7 వ శతాబ్దంలో చాళుక్య వంశ రాజు కరణ్ దేవ్ ఈ ఆలయాన్ని నిర్మించారు. దేశంలోని 108 శక్తి పీఠాల్లో కొల్హాపూర్ మహాలక్ష్మి ఆలయం ఒకటి. కొల్హాపూర్లో దేవీ అంబాబాయి దర్శనం తరవాత కేసీఆర్ ప్రత్యేక విమానంలో తిరిగి హైదరాబాద్ కు చేరుకుంటారు.

Also Read:నేషనల్ పాలిటిక్స్ పై  అధినేతల మౌనం!

- Advertisement -