మహబూబాబాద్‌, భద్రాద్రికి సీఎం కేసీఆర్

16
- Advertisement -

సీఎం కేసీఆర్ ఇవాళ మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నారు. ప్రజల సౌకర్యార్థం నిర్మించిన సమీకృత భవన సముదాయాలను ప్రారంబించనున్నారు. తొలుత మానుకోటకు తర్వాత కొత్తగూడేంలో కలెక్టరేట్ ఆఫీస్ ప్రారంభంతో పాటు రెండు జిల్లాల్లో బీఆర్ఎస్‌ ఆఫీసులను ప్రారంభించనున్నారు.

మహబూబాబాద్‌ సమీకృత కలెక్టరేట్‌ సముదాయాన్ని ప్రారంభించి, పరిశీలించనున్నారు. తర్వాత అధికారయంత్రాంగం, ప్రజాప్రతినిధులతో మహబూబాబాద్‌ జిల్లా ప్రగతిపై సీఎం సమీక్ష నిర్వహించనున్నారు.

కొత్తగూడెం పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌.. రెండున్నర గంటలపాటు పట్టణంలో పర్యటించనున్నారు. సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభించి, పరిశీలించనున్నారు. 10 వేలమంది హాజరవనున్న సభలో సీఎం కేసీఆర్‌ ప్రసంగించనున్నారు. అనంతరం పట్టణంలోని ఎల్‌ఐసీ ఆఫీసు పక్కన నిర్మించిన బీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయాన్ని కేసీఆర్‌ ప్రారంభించనున్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -