జడ్చర్ల, మేడ్చల్‌కు సీఎం కేసీఆర్‌

32
- Advertisement -

సీఎం కేసీఇర్ ఇవాళ మేడ్చల్, మల్కాజిగిరి నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు. తొలుత జడ్చర్ల ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడనున్న సీఎం….తర్వాత మేడ్చల్ జిల్లాలో జరిగే సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. తొలి దశలో 41 నియోజకవర్గాల్లో సీఎం సభలు ఉండనుండగా సీఎం సభలకు భారీగా ప్రజలు తరలివస్తున్నారు.

బీఆర్‌ఎస్‌ ఎన్నికల మ్యానిఫెస్టోలపై ప్రజల నుండి మంచి స్పందన వస్తోంది. ఇక జడ్చర్ల, మేడ్చల్ సభలకు కూడా భారీగా జన సమీకరణ చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. జడ్చర్ల పట్టణంలోని గంగాపూర్‌ రోడ్డు శివాలయం సమీపంలో బహిరంగ సభ జరగనుంది.

మేడ్చల్‌లోని గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో 15 ఎకరాల్లో సభకు ఏర్పాట్లు చేశారు. సభ ప్రాంగణం సీఎం కేసీఆర్‌, మంత్రి మల్లారెడ్డి ఫ్లెక్సీలు పెట్టారు. సభకు వచ్చే ప్రజలకు అన్ని వసతులు కల్పించారు.

Also Read:Siddipet:చాయ్ తాగిన సీఎం కేసీఆర్..

- Advertisement -