- Advertisement -
నేడు ( 24 తేదీ శుక్రవారం ) ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఢిల్లీ పర్యటన చేపట్టనున్నారు. శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న శాసన సభా కార్యక్రమంలో పాల్గొని,అనంతరం జరిగే బిఎసి సమావేశం తర్వాత సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెల్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఈనెల 25న కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షకావత్ తో సమావేశమౌతారు.
26వ తేదీన విజ్జానభవన్ లో కేంద్ర హోం మంత్రిత్వశాఖ నిర్వహించే సమావేశంలో పాల్గొంటారు. అనంతరం ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయెల్తో మాట్లాడుతారు. అదే రోజు సాయంత్రం హైద్రాబాద్ తిరుగు ప్రయాణమౌతారు.
- Advertisement -