ప్రగతిభవన్‌లో నిరాడంబరంగా స్వాతంత్ర్య దినోత్సవేడుకలు..

205
cm kcr
- Advertisement -

దేశవ్యాప్తంగా 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. హైదరాబాద్ ప్రగతి భవన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు సీఎం కేసీఆర్. సీఎం కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ ముఖ్యనాయకులు, అధికారులతో కలిసి జాతీయ పతాకం ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు.

దేశానికి సేవ చేసిన వారి త్యాగాలను గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఆవిర్భావం దగ్గరినుండి గోల్కొండ కోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నారు. అయితే కరోనా వైరస్ వ్యాప్తి వల్ల ఈసారి వేడుకల వేదికను ప్రగతి భవన్‌కు మార్చారు. సీఎం కేసీఆర్ వెంట కేశవరావు, ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి తదితరులున్నారు.

- Advertisement -