రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు రాఖీ శుభాకాంక్ష‌లు తెలిపిన సీఎం కేసీఆర్..

192
cm kcr
- Advertisement -

రాఖీ పౌర్ణమి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని తెలంగాణ ప్రజలకు రాష్ట్ర‌ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. దేశవ్యాప్తంగా జరుపుకునే రక్షా బంధన్ పండుగ సహోదరత్వానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. జీవితాంతం తమకు అండగా ఉండాలని ఆడబిడ్డలు తమ అన్నాదమ్ముళ్ల‌కు అనురాగంతో చేతికి రక్షా బంధనాన్ని కట్టడం గొప్ప సందర్భంగా సీఎం తెలిపారు. రక్షాబంధన్ సాంప్రదాయం భారతీయ జీవన ఔన్నత్యానికి నిదర్శనమని, ప్రజల్లో సహోదరత్వాన్ని మరింతగా పెంచుతుందని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.

- Advertisement -