రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్‌ క్రిస్మస్ శుభాకాంక్షలు..

195
cm kcr
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. యేసు క్రీస్తు ప్రవచించిన ప్రేమ, కరుణ, శాంతి అనే సుగుణాలను పాటిస్తే అందరి జీవితాలు సుఖశాంతులతో నిండుతాయని ముఖ్యమంత్రి అన్నారు. యేసుక్రీస్తు బోధనలు ప్రపంచాన్ని ప్రభావితం చేశాయని ముఖ్యమంత్రి అన్నారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ప్రజలు సంతోషంగా క్రిస్మస్ పండుగను జరుపుకోవాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

- Advertisement -