11న కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం..

356
cm kcr
- Advertisement -

ఈ నెల 11న కలెక్టర్లతో సమావేశం కానున్నారు సీఎం కేసీఆర్. ప్రగతి భవన్‌లో ఉదయం 11 గంటలకు జరిగే ఈ భేటీలో పట్టణ ప్రగతిపై కీలకంగా చర్చించే అవకాశాలున్నాయి. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎస్ సోమేష్‌ కుమార్.

సీఎం ఆదేశాలతో కలెక్టర్ల సదస్సుకు అధికారులు ఏర్పాట్లు చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ సమావేశంలో కొత్త మున్సిపల్ చట్టంపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఐఏఎస్‌ల బదిలీ అనంతరం కలెక్టర్ల సదస్సు నిర్వహిస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలపై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.

వివిధ జిల్లాల కలెక్టర్లను బదిలీ చేసిన ప్రభుత్వం…. ఆరుగురికి పోస్టింగులు ఇవ్వలేదు. సీనియర్లు సహా వివిధ శాఖల్లో ఏళ్లుగా పని చేస్తున్న వారందర్నీ ప్రభుత్వ ట్రాన్స్‌ఫర్ చేసింది. కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఈ స్థాయిలో ఐఏఎస్‌ల బదిలీలు జరగడం ఇదే తొలిసారి.

- Advertisement -