ఎమ్మెల్యే గాదరి కిశోర్ ఇంట విషాదం..సీఎం సంతాపం

117
KCR
- Advertisement -

ఎమ్మెల్యే గాదరి కిశోర్‌ కుమార్‌ ఇంట విషాదం నెలకొంది. ఎమ్మెల్యే తండ్రి గాదరి మారయ్య మృతిచెందారు. మారయ్య మృతిపట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం తెలిపారు. కిశోర్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు.

నల్లగొండ మండలం నర్సింగ్‌భట్లకు చెందిన గాదరి మారయ్య పీఈటీగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సేవలందించారు. ప్రస్తుతం నల్లగొండ పట్టణంలో కుటుంబంతో కలిసి శేషజీవితం గడుపుతున్నారు. శుక్రవారం అర్ధరాత్రి అకస్మాత్తుగా మారయ్య మరణించారు.

- Advertisement -