ఓటేసిన సీఎం కేసీఆర్ దంపతులు..

37
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. సీఎం కేసీఆర్ దంపతులు సిద్దిపేట జిల్లాలోని చింతమడక గ్రామంలో ఓటేశారు. సతీమణి శోభతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

గ్రామంలోని 13వ పోలింగ్ కేంద్రంలో సీఎం దంపతులు ఓటు వేశారు. సీఎంకు చింతమడక గ్రామం ఒక సెంటిమెంట్. మ‌ధ్యాహ్నం 1 గంట వ‌ర‌కూ రాష్ట్ర‌వ్యాప్తంగా 36.68 శాతం పోలింగ్ న‌మోదైంది. ఇక హైద‌రాబాద్‌లో అత్య‌ల్పంగా కేవ‌లం 20.79 శాతం పోలింగ్ నమోదవుతోంది.

న‌గ‌ర‌, ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం పెర‌గాల‌ని తెలంగాణ రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి వికాస్ రాజ్ అన్నారు. న‌గ‌ర ఓట‌రు ఇండ్ల‌ను వీడి పోలింగ్ కేంద్రాల‌కు త‌ర‌లిరావాల‌ని మంత్రి కేటీఆర్ కోరారు.

Also Read:ఫ్యామిలీతో  వచ్చి  ఓటేసిన  స్టార్స్    

- Advertisement -