ఉద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్..

140
CM KCR
- Advertisement -

ఉద్యోగులకు తీపికబురునందించారు సీఎం కేసీఆర్. ఎంతోకాలం పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగుల పదోన్నతుల దస్త్రంపై సంతకం చేశారు. అలాగే పదోన్నతుల కోసం ఉద్యోగుల కనీస సర్వీసును మూడేళ్ల నుంచి రెండేళ్లకు కుదిస్తూ నిర్ణయం తీసుకుంది.

కారుణ్య నియామకాలు పూర్తి చేయాలని సూచించిన సీఎం…జిల్లా స్థాయిలోని వివిధ శాఖలు, కేటగిరీల్లో ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను ఇటీవల సీఎం ఆదేశించారు.

పదోన్నతుల దస్త్రంపై సీఎం సంతకం చేయడంతో అర్హులైన ఉద్యోగులకు ఈ నెలాఖరులోగా పదోన్నతులు లభించనున్నాయి.

- Advertisement -