సీజేఐ యాదాద్రి పర్యటనలో స్వల్ప మార్పు..

99
nv ramana
- Advertisement -

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ యాదాద్రి పర్యటనలో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. ఈనెల 14వ తేదీన సీజేఐ ఎన్వీ రమణ తండ్రి తిథి కావడంతో యాదాద్రి పర్యటన వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో ఎల్లుండి (మంగళవారం) యాదాద్రి క్షేత్రాన్ని సందర్శించనున్నారు సీజేఐ ఎన్వీ రమణ. గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్, సీఎం కేసీఆర్, హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి హిమా కోహ్లీ తదితరులు ప్రధాన న్యాయమూర్తి వెంట వెళ్లనున్నారు. శ్రీ స్వామి వారిని దర్శించుకున్న అనంతరం వారు యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించనున్నారు.

- Advertisement -