సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఫ్యామిలీ ఫోటో వైరల్గా మారింది. వాస్తవానికి ఈ ఫోటో తన కుమార్తెలు ఈ ఏడాది జనవరిలో సుప్రీం కోర్టును సందర్శించిన ఫోటో కాగా ఇప్పుడు ఓ పత్రిక ప్రచురిండంతో వైరల్గా మారింది. . తన కూతుళ్ల కోరికమేరకు సుప్రీం కోర్టుకు పిలిపించిన చంద్రచూడ్…సుప్రీంకోర్టు పనితీరు, కార్యకలాపాలను దగ్గరుండి చూపించారు. ఈ సందర్భంగా దిగిన ఫోటో ఇప్పుడు వైరల్గా మారింది.
సీజేఐ డీవై చంద్రచూడ్ కు ఇద్దరు భార్యలు. మొదటి భార్య రష్మీ 2007లో మరణించారు. చంద్రచూడ్-రష్మీ దంపతులకు ఇద్దరు కుమారులు అభినవ్, చింతన్ ఉన్నారు. ఇద్దరూ న్యాయవాద వృత్తిలోనే స్థిరపడ్డారు. బొంబే హైకోర్ట్ లో అభినవ్ న్యాయవాదిగా పని చేస్తోన్నారు. రష్మీ మరణం తరువాత కల్పనా దాస్ ను రెండో వివాహం చేసుకున్నారాయన. వీరు ఇద్దరు ఆడపిల్లలను పెంచుకుంటోన్నారు. పెద్ద కుమార్తె పేరు ప్రియాంక. 20 సంవత్సరాలు. చిన్న కూతురి పేరు మహీ. 16 సంవత్సరాలు. ఇద్దరూ వికలాంగులే. వీల్ ఛైర్లకే పరిమితం అయ్యారు. వారిద్దరి కోరిక మేరకు సుప్రీంకోర్టు కార్యకలాపాలు ఎలా ఉంటాయనే విషయాన్ని ఆయన ప్రత్యక్షం చూపించారు.
Also Read:Friendship Day: ట్రెండ్ మారినా.. ఫ్రెండ్ మారడే