మొక్కలు నాటిన దర్శకుడు వి.వి. వినాయక్

439
green
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం ఉద్యమంలా సాగుతుంది. ఈగ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్. జూబ్లీహిల్స్ లోని తన ఆఫీసు ఆవరణలో మూడు మొక్కలు నాటారు.

ఈసందర్భంగా వి.వి.వినాయక్ మాట్లాడుతూ.. మనిషి బ్రతకడానికి మొక్కలు ఎంతో అవసరం అన్నారు. గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని ఎంపీ సంతోష్ కుమార్ ఓ యజ్నంలా చేస్తున్నారని కొనియాడారు. ఇంచ మంచి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ సంతోష్ కుమార్ కు హృదయ పూర్వక కృతజ్నతలు తెలిపారు. మరో ముగ్గురు మిత్రులకు మొక్కలు నాటాల్సిందిన సవాల్ విసిరారు. హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నిర్మాతలు నల్లమలుపు బుబ్జి, మల్లిడి సత్యనారాయణ రెడ్డికి మొక్కలు నాటాల్సిందిగా సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఛాలెంజ్ ప్రతినిధి కాదంబరి కిరణ్ పాల్గోన్నారు.

- Advertisement -