మొక్కలు నాటిన ఆర్.నారాయణమూర్తి

51
- Advertisement -
బీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ జోరుగా సాగుతుంది.  ప్రకృతి పరిరక్షణకు కృషి చేస్తున్న ఎంపీ సంతోష్‌ కుమార్ స్థాపించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో ప్రముఖ దర్శకుడు నటుడు నిర్మాత ఆర్. నారయణమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్‌లోని జీహెచ్‌ఎంసీ పార్క్‌లో మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ…సీఎం కేసీఆర్ హరితహారం స్పూర్తితో ఎంపీ సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఒక ఉద్యమంలా ముందుకు తీసుకువెళ్తున్నారని అన్నారు. దేశవ్యాప్తంగా ఎందరినో ఈ కార్యక్రమంలో భాగం చేసినందుకు ఎంపీ సంతోష్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సకాలంలో వర్షాలు కురవాలన్న వాతావరణంలో మార్పులను అరికట్టాలన్న మొక్కలు నాటడం ద్వారానే సాధ్యమని అన్నారు. ఇలాంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని కోరారు.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ నుండి వలసలు పోయేవారని కానీ నేడు తెలంగాణకు వలసలు పెరిగాయని అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సస్యశ్యామలంగా మారిందన్నారు. ఇంత గొప్ప కార్యాక్రమంలో పాల్గొని మొక్కలు నాటినందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్‌కుమార్‌కు ధన్యవాదాలు తెలిపారు.
- Advertisement -