సంగారెడ్డిలో చోటా భీమ్‌..

453
Sangareddy Govt Hospital
- Advertisement -

సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో చోటా భీమ్ జన్మించాడు. అప్పుడే పుట్టిన శిశువు 3 లేదా మూడున్నర కిలోలు ఉండటం చూశాం. కానీ సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో శుక్రవారం ఓ మహిళ 4.75 కిలోల మగ శిశువుకు జన్మనిచ్చింది.

child was born 4.7 kg in sangareddy hospital

శంకర్‌పల్లి మండలం పర్వేద గ్రామానికి చెందిన సీహెచ్‌. అనూష ప్రసవం కోసం సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. మొదటి కాన్పులోనే బాబు పుట్టడమే కాకుండా, 4.75కిలోల బరువు ఉండటంతో కుటుంబసభ్యుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తల్లి,బిడ్డలిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్లు తెలిపారు.

- Advertisement -