ఎట్టకేలకు చిక్కిన చిరుత…

496
chirutha
- Advertisement -

హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో కొంతకాలంగా కలకలం సృష్టించిన చిరుత ఎట్టకేలకు చిక్కింది. చిరుతను పట్టుకునేందుకు ఆరు నెలలుగా శ్రమిస్తున్నారు అటవీ శాఖ అధికారులు.

అయితే చిరుతను పట్టునేందుకు ఎరగా గొర్లు,ఆవు దూడలను ఉంచగా అధికారుల ప్రయత్నం ఫలించింది. రాజేంద్రనగర్‌లోని వాలంతరి వద్ద ఉద‌యం 4 గంట‌ల‌కు బోనులో చిక్కింది. శనివారం ఈ ప్రాంతంలో చిరుత సంతరించడంతో వాలంత‌రి రైస్ రిసెర్చ్ సెంట‌ర్ వ‌ద్ద ఓ ప‌శువుల‌కొట్టంలో రెండు ఆవుదూడ‌ల‌ను చంపి తిన్న‌ది.

దీంతో పోలీసులు, అట‌వీశాక అధికారులు నిన్న చ‌నిపోయిన రెండు ఆవు దూడ‌ల‌ను అందులో ఎర‌గా ఉంచారు. దూడ‌ల‌కోసం వ‌చ్చిన చిరుత బోనులో చిక్కింది. దీంతో ప్రజలు ఉపిరి పీల్చుకున్నారు.

- Advertisement -