ఆ దర్శకుడి మోసం.. అయినా మంచే పంచాడు

56
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో ‘మెగా156’ తెరకెక్కుతున్న విష‌యం తెలిసిందే. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సినిమాలో హీరో కళ్యాణ్ రామ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారని స‌మాచారం. వశిష్ఠ ను దర్శకుడిగా పరిచయం చేసింది కళ్యాణ్ రామే. నిజానికి కళ్యాణ్ రామ్ తో వశిష్ఠ వెంటనే సినిమా కూడా చేయాలి. కానీ, మెగా ఆఫర్ రావడంతో వశిష్ఠ, కళ్యాణ్ రామ్ సినిమాని పోస్ట్ పోన్ చేసి.. మెగాస్టార్ చిరంజీవితో తన సినిమాని స్టార్ట్ చేశాడు. అగ్రిమెంట్ ప్రకారం కళ్యాణ్ రామ్ తో వెంటనే సినిమా చేయాలి.. పైగా కళ్యాణ్ రామ్ కి మాట కూడా ఇచ్చాడట. అందుకే, మెగాస్టార్ సినిమాలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ లో ఓ పవర్ ఫుల్ రోల్ ను డిజైన్ చేశాడు వశిష్ఠ.

ఈ పాత్రను కళ్యాణ్ రామ్ చేత చేయించాలని వశిష్ఠ ప్లాన్ చేశాడు. కళ్యాణ్ రామ్ ను కలిసి పాత్ర కూడా చెప్పాడు. సహజంగా తనతో సినిమాను ఫిక్స్ చేసుకుని.. ఆ సినిమాని మధ్యలోనే వదిలేసి, వేరే సినిమా చేస్తే.. ఏ హీరో అయినా సీరియస్ అవుతాడు. ఆ దర్శకుడి పై కోపం చూపిస్తాడు. కానీ, కళ్యాణ్ రామ్ మంచోడు కదా. అందుకే కోపం గట్రా చూపించకుండా, ప్రేమగా మాట్లాడి చూద్దాం. కుదిరితే కచ్చితంగా నువ్వు చెప్పిన ఈ పాత్రను చేస్తాను అంటూ మాట ఇచ్చాడు. పాపం కళ్యాణ్ రామ్… ఊరు పేరు లేని వాళ్లను పట్టుకొచ్చి.. దర్శకుడిగా ఛాన్స్ ఇచ్చి లైఫ్ ఇస్తే.. అందరూ కళ్యాణ్ రామ్ కి చివరకు హ్యాండ్ ఇస్తున్నారు.

ఈ లిస్ట్ లో తాజాగా వశిష్ఠ కూడా చేరాడు. ఇంతకు ముందు ఈ లిస్ట్ లో చాలామందే ఉన్నారు. కాకపోతే ప్రముఖంగా చెప్పుకోవాల్సిన పేర్లు మాత్రం రెండు ఉన్నాయి. దర్శకుడు అనిల్ రావిపూడి, మరో దర్శకుడి విషయానికి వస్తే.. దర్శకుడు సురేందర్ రెడ్డి. ఈ ఇద్దరికీ సినిమా ఇండస్ట్రీలో కళ్యాణ్ రామే లైఫ్ ఇచ్చాడు. కెరీర్ లో ఎదిగిన తర్వాత, ఈ ఇద్దరు మళ్లీ కళ్యాణ్ రామ్ తో మరో సినిమా చేయడానికి ఆసక్తి చూపించలేదు. మెగాస్టార్ చిరంజీవితో చేసే సినిమా హిట్ అయితే, దర్శకుడు వశిష్ఠ కూడా కళ్యాణ్ రామ్ తో మరో సినిమా చేయడానికి ఆసక్తి చూపించకపోవచ్చు.

Also Read:Modi:మోడీ’ నిధుల ‘ డ్రామా!

- Advertisement -