ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌లో మార్పులు?

61
- Advertisement -

చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ , బాలయ్య ‘వీర సింహా రెడ్డి’ సినిమాలకు సంబంధించి భారీ ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఇంటర్వ్యూలు , ప్రెస్ మీట్స్ ఏర్పాటు చేస్తూ ప్రతీ రోజు సినిమాలు వార్తల్లో ఉండేలా చూసుకుంటున్నారు. అయితే ఈ సినిమాలకు సంబంధించి భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

‘వీరసింహారెడ్డి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఒంగోలు ABM గ్రాండ్స్ లో ప్లాన్ చేశారు. ఒంగోల్ గ్రౌండ్స్ లో అన్నీ ఏర్పాట్లు చేసిన టీంకి పోలీస్ పర్మిషన్ లభించకపోవడంతో షాక్ తగిలింది. వెంటనే ఒంగోల్ లో మరో ప్లేస్ కి పర్మిషన్ తీసుకొని అక్కడ మళ్ళీ ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం.

ఇక వాల్తేరు వీరయ్య ఈవెంట్ కి కూడా పర్మిషన్ దక్కని పరిస్థితి. చిరు ఈవెంట్ కోసం వైజాగ్ బీచ్ సమీపంలో ఓ ప్లేస్ అనుకుంటున్నారు. కానీ అక్కడ కాకుండా వీరయ్య కోసం మరో ప్లేస్ ఎలాట్ చేసే పనిలో ఉన్నారట వైజాగ్ పోలీస్ శాఖ. సో ముందుగా అనుకున్న ప్లేస్ లు కాకుండా అదే ఊరిలో మరో చోట ఈ రెండు ఈవెంట్స్ జరగనున్నాయని తెలుస్తుంది. త్వరలోనే ఈవెంట్స్ పై మేకర్స్ నుండి క్లారిటీ రానుంది. వీరసింహా రెడ్డి ఈవెంట్ రేపే జరగనుంది. వాల్తేరు వీరయ్య ఈవెంట్ జనవరి 8న ప్లాన్ చేస్తునారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -