ఎక్కడ నెగ్గాలో..తగ్గాలో తెలిసిన వ్యక్తి పవన్‌!

19
- Advertisement -

ఎక్కడ నెగ్గాలో  ..తగ్గాలో తెలిసిన వ్యక్తి పవన్ అన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి విజయంపై టాలీవుడ్‌ మెగాస్టార్‌, పద్మవిభూషణ్‌ చిరంజీవి స్పందించారు. తెలుగుదేశం – జనసేన – బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. 175 అసెంబ్లీ స్థానాలకు గానూ ఏకంగా 160కిపైగా స్థానాలను గెలుచుకుంది.

ఈ నేపథ్యంలో స్పందించిన చిరు…డియర్ కళ్యాణ్ బాబు..ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను, తగ్గావని ఎవరు అనుకున్నా అది ప్రజలని నెగ్గించటానికే అని నిరూపించిన నిన్ను చూస్తుంటే ఒక అన్నగా గర్వంగా వుంది. నువ్వు Game Changer వి మాత్రమే కాదు, Man of the match వి కూడా అని అందరూ నిన్ను కొనియాడుతుంటే నా హృదయం ఉప్పొంగుతోంది !!నీ కృషి, నీ త్యాగం, నీ ధ్యేయం, నీ సత్యం జనం కోసమే! ఈ అద్భుతమైన ప్రజా తీర్పు, రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల సంక్షేమం కోసం, అలాగే నీ కలల్ని, నువ్వేర్పరుచుకున్న లక్ష్యాల్ని నిజం చేసే దిశలో నిన్ను నడిపిస్తాయని ఆకాంక్షిస్తూ, ఆశీర్వదిస్తూ, శుభాభినందనలు. నీవు ప్రారంభించే ..ఈ కొత్త అధ్యాయంలో నీకు శుభం కలగాలని , విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అన్నారు.

చరిత్రలో అరుదైన విజయాన్ని అందుకున్న తెదేపా అధినేత చంద్రబాబుకు ముందుగా శుభాకాంక్షలు, అభినందనలు. ఈ మహత్తర విజయం.. మీ మీద ప్రజలకున్న నమ్మకానికి, మీ నాయకత్వ పటిమకు, రాష్ట్రానికి గత వైభవం తిరిగి తేగలిగిన మీ దక్షతకు నిదర్శనం. రాజకీయ దురంధరులైన మీ మీద, పవన్ కల్యాణ్, నరేంద్ర మోదీ గారి మీద ప్రజలు కనబరచిన విశ్వాసాన్ని సంపూర్ణంగా నిలబెట్టుకొని, రాజధాని లేని, గాయపడిన రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెట్టి నెంబర్ వన్‌గా తీర్చిదిద్దుతారని ఆశిస్తున్నాను.. !’ అంటూ పోస్టు పెట్టారు.

Also Read:భారీగా తగ్గిన జగన్ మెజార్టీ!

- Advertisement -