చిరుతో ‘రిపబ్లిక్’ ట్రైలర్‌..

224
Republic Trailer
- Advertisement -

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కథానాయకుడిగా దర్శకుడు దేవ కట్టా ‘రిపబ్లిక్’ సినిమాను రూపొందించాడు. భగవాన్ – పుల్లారావు నిర్మించిన ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని అందించాడు. ఐశ్వర్య రాజేశ్ కథానాయికగా నటించిన ఈ సినిమాను, అక్టోబర్ 1వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు.

బుధవారం ఉదయం 10 గంటలకు చిరంజీవి చేతుల మీదుగా ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నారు. ఆ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ, స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అవినీతిపరులైన రాజకీయనాయకులను ఎదిరించే నిజాయతీ పరుడైన ఒక కలెక్టర్ కథ ఇది. ఆ కలెక్టర్ పాత్రలో సాయితేజ్ నటించగా, రాజకీయ నాయకురాలుగా రమ్యకృష్ణ కనిపించనుంది.

- Advertisement -