స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తన తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవితో చేయనున్నారు. అందుకు సంబంధించిన స్క్రిప్ట్ పై కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి సైరా మూవీలో బిజీగా ఉండటంతో ఈసినిమా షూటింగ్ ను ఫ్రిబ్రవరిలో ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. సైరా మూవీని 2019సమ్మర్ లో విడుదల చేయనున్నారనే వార్తలు వస్తున్నాయి. చిరు కొరటాల కాంబినేషన్ లో వచ్చే చిత్రంలో హీరోయిన్ గా ఎవరిని తీసుకుంటారనేదానిపై టాలీవుడ్ లో చర్చ నడుస్తోంది.
ప్రస్తుతం తెలుగు .. తమిళ భాషల్లో అనుష్క .. నయనతార .. త్రిష .. శ్రియ మాత్రమే సీనియర్ కథానాయికలుగా కనిపిస్తున్నారు. వీరందరూ తెలుగు, తమిళ సీనియర్ హీరోల సరసన నటిస్తున్నారు. వీరందరిలో నయనతారకు ఎక్కువ క్రేజ్ ఉంది. అందుకే ఆమెను సైరా సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నారు. తన క్రేజ్ కి తగిన జోడీగాను నయనతార అయితేనే బాగుంటుందని చిరంజీవి చెప్పడంతో కొరటాల కూడా ఆమెనే ఎంపిక చేసినట్టు సమాచారం.