ముంబైలో గాడ్‌ఫాదర్!

70
chiru
- Advertisement -

మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం గాఢ్‌ఫాదర్. ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ పొలిటికల్ థ్రిల్లర్ మూవీగా రానుండగా ఇటీవల విడుదలైన ఫస్ట్‌ లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చేసింది.

జూలై 28 నుండి నెక్ట్స్ షెడ్యూల్ ప్రారంభంకానుండగా ఇది ముంబైల జరగనుంది. చిరు – సల్మాన్ మధ్య కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఆగస్టు 4 వరకు ముంబైలో షూటింగ్ జరగనుండగా తర్వాత మిగితా పార్టును హైదరాబాద్‌లో చిత్రీకరించనున్నారు.

చిరు సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తోండగా, సత్యదేవ్, సునీల్, పూరీ జగన్నాధ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సూపర్ గుడ్ ఫిలింస్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీలు ఈ సినిమాను సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి.

- Advertisement -