తనయుడిని చూసి..చిరు భావోద్వేగం!

99
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగానికి గురయ్యారు. తన తనయుడు రామ్ చరణ్‌ ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా ట్రూ లెజెండ్ అవార్డును అందుకోవడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేస్తూ నాన్నా… ట్రూ లెజెండ్ అవార్డును గెలుచుకున్న నిన్ను చూసి చాలా గర్విస్తున్నా. ఇలాగే ముందుకు సాగిపోవాలని అమ్మ, నేను కోరుకుంటున్నాం’ అని ట్వీట్ చేశారు. చరణ్ పిల్లవాడిగా ఉన్నప్పటి ఫొటోను షేర్ చేశారు.

వివిధ రంగాల్లో విశేషమైన సేవలు అందిస్తున్న వ్యక్తులకు ఓ జాతీయ మీడియా సంస్థ ఈ అవార్డులను అందిస్తోంది. ఎంటర్‌టైయిన్‌ మెంట్ రంగంలో రామ్ చరణ్ ట్రూ లెజెండ్ అవార్డును అందుకున్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -