- Advertisement -
ఏపీలో కూటమికి మెగాస్టార్ చిరంజీవి మద్దతిచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా చిరు తన తమ్ముడు పవన్ తరపున పిఠాపురం ప్రచారానికి వస్తున్నారని పుకార్లు షికార్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో గాసిప్స్పై క్లారిటీ ఇచ్చారు చిరంజీవి. తాను ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉన్నానని…పిఠాపురం ప్రచారానికి వెళ్లడం లేదన్నారు. ప్రచారానికి రావాలని పవన్ తనను పిలవలేదన్నారు. బయట జరిగేవన్ని పుకార్లేనని చెప్పారు. ఎన్టీఆర్ భారతరత్నకు అర్హుడని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ దిశగా ఆలోచించాలని చిరంజీవి కోరారు.
Also Read:కవిత బెయిల్..24న సమగ్ర విచారణ
- Advertisement -