Chiranjeevi:మెగాస్టార్ రూట్ మార్చారా?

33
- Advertisement -

ప్రస్తుతం ఉన్న సీనియర్ హీరోలలో ఎక్కువగా రీమేక్ సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ కు విసుగు తెప్పించిన స్టార్ హీరోలలో మెగాస్టార్ ముందు వరుసలో ఉంటాడు. తన రీఎంట్రీ మూవీతోనే రీమేక్ బాట పట్టాడు. ఆ తరువాత సైరా నరసింహారెడ్డి, ఆచార్య మినహా ఆ తర్వాత వచ్చిన గాడ్ ఫాదర్ తో మళ్ళీ రీమేక్ ఎంచుకున్నాడు. అయితే ఆ సినిమా ఫ్లాప్ గా నిలిచింది. ఆ తర్వాత వాల్తేరు వీరయ్య మూవీతో స్ట్రైట్ మూవీగా వచ్చి హిట్ గా నిలిచినప్పటికీ చిరు రేంజ్ హిట్ కాదని ఆయన అభిమానులే పెదవి విరిచారు. ఆ తరువాత మళ్ళీ భోళా శంకర్ అంటూ మరో రీమేక్ సినిమా చేసి తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ చవి చూశారు.

దీంతో భోళా శంకర్ ఇచ్చిన ఎఫెక్ట్ తో ఇక రీమేక్ మూవీస్ వైపు వెళ్లకూడదని చిరు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ కూడా మొదట రీమేకే అనే వార్తలు వచ్చాయి. దీంతో ఆ ప్రాజెక్ట్ రీమేక్ మూవీ నా కదా అనే దానిపై ఎలాంటి క్లారిటీ లేదు. ఇక ఆ తర్వాత పూర్తిగా అన్నీ స్ట్రయిట్ మూవీస్ నే లైన్ లో పెట్టారు మెగాస్టార్. బింబిసార మూవీతో సూపర్ హిట్ కొట్టిన వశిష్ట దర్శకత్వంలో ఓ సోసియో ఫాంటసీ మూవీ చేస్తున్నారు.

ఆ తర్వాత కూడా బడా దర్శకులైన త్రివిక్రమ్, సుకుమార్, అనిల్ రావిపూడి వంటి దర్శకులతో మూవీస్ చేసేందుకు మెగాస్టార్ సిద్దమౌతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. డివివి దానయ్య నిర్మాతగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తారని గతంలోనే వార్తలు వచ్చాయి. ఆ ప్రాజెక్టు త్వరలోనే ఒకే అయ్యే అవకాశం ఉందట. ఇక చిరు సుకుమార్ కాంబినేషన్ కోసం మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు టాక్. అలాగే అనిల్ రావిపూడి కూడా చిరు కోసం కథ రెడీ చేసే పనిలో ఉన్నారట. మొత్తానికి భోళా శంకర్ డిజాస్టర్ తరువాత చిరులో మార్పు వచ్చిందని.. అయినా మార్పు మంచికే అని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

Also Read:World Cup 2023:సెంచరీ మిస్.. పాండ్యనే కారణమా!

- Advertisement -