Chhattisgarh:8 మంది న‌క్స‌ల్స్ హ‌తం

4
- Advertisement -

ఛత్తీస్‌గఢ్‌ మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. నారాయ‌ణ‌పుర్‌లో ఇవాళ జరిగిన ఎన్‌కౌంటర్‌లో 8 మంది న‌క్స‌లైట్లు, ఒక భ‌ద్ర‌తా సిబ్బంది మృతిచెందారు. మ‌రో ఇద్ద‌రు జ‌వాన్లు గాయ‌ప‌డ్డారు.

నారాయ‌ణ‌పుర్, కంకేర్, దంతేవాడ‌, కొండ‌గావ్ జిల్లాల‌కు చెందిన భ‌ద్ర‌తా ద‌ళాలు యాంటీ న‌క్స‌ల్ ఆప‌రేష‌న్ చేప‌డుతున్న స‌మ‌యంలో ఎదురుకాల్పులు జ‌రిగాయని పోలీసులు వెల్లడించారు. ఈ కాల్పుల్లో 8 మంది మావోలు మృతి చెందారని వెల్లడించారు.

డిస్ట్రిక్ట్ రిజ‌ర్వ్ గార్డ్‌, స్పెష‌ల్ టాస్క్ ఫోర్స్‌, 53 బెటాలియ‌న్ ఐటీబీపీకి చెందిన ద‌ళాలు జూన్ 12వ తేదీన కూంబింగ్ ఆప‌రేష‌న్ మొద‌లుపెట్టాయి.

Also Read:మిరియాలతో ఆరోగ్యం..

- Advertisement -