తెలంగాణపై కేంద్రం ప్రభుత్వం వివక్ష చూపిస్తుందని ఇది సరైన విధానం కాదని మంత్రి హరీశ్రావు అన్నారు. ఎయిమ్స్లో ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి లేదని విమర్శించారు. చౌటుప్పల్లో 100పడకల అసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ…2018లో యాదాద్రి జిల్లాకు ఎయిమ్స్ ప్రకటిస్తే నాలుగేళ్ల తర్వాత మోదీ వచ్చి శంకు స్థాపన చేశారని మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు.
ఒక్క ఎయిమ్స్ కేటాయించి కేంద్రం గొప్పలు చెప్పుకుంటుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వంకు చేతలు తక్కువ..ప్రచారం ఎక్కువగా అన్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది 8 వైద్య కళశాలలు ప్రారంభించిందని గుర్తు చేశారు. ఎయిమ్స్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 200 ఎకరాల భూమిని కేటాయించిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పనితీరును నీతిఆయోగ్ కూడా ప్రశంసించిందని తెలిపారు.
also read: ఏపీ మంత్రులు.. చేతనైతే పోరాడండి !
రాష్ట్ర ప్రభుత్వం పనితీరును నీతిఆయోగ్ స్వయంగా ప్రశంసించిందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 102 డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఫ్లోరైడ్ను తరిమేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఒక్క ఏడాదిలో 10వేల పడకలు అందుబాటులోకి రాబోతున్నాయని తెలిపారు.
వరంగల్ హెల్త్ సిటీ పనులు వేగంగా జరుగుతున్నాయని అన్నారు. డిసెంబర్ నాటికి వరంగల్ హెల్త్ సిటీ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. దేశానికే తెలంగాణ మోడల్గా ఉందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పాలనలో వైద్య విద్య బలోపేతమైందని మంత్రి హరీశ్ రావు పునరుద్ఘాటించారు. తెలంగాణ ప్రభుత్వం విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తోందని.. ఇదే కాంగ్రెస్ పాలనకు బీఆర్ఎస్ పాలనకు తేడా అని స్పష్టం చేశారు.
also read: క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్..