ఢిల్లీపై చెన్నై గ్రాండ్ విక్టరీ…

91
csk
- Advertisement -

ఐపీఎల్ 15వ సీజన్‌లో భాగంగా ఢిల్లీపై గ్రాండ్ విక్టరీ సాధించింది చెన్నై. 209 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ 17.4 ఓవర్లలో 117 పరుగులకే కుప్పకూలింది. దీంతో చెన్నై 91 పరుగుల తేడాతో విజయం సాధించింది. మిచెల్‌ మార్ష్‌ (25) ,కేఎస్‌ భరత్‌ (8), వార్నర్‌ (19),పంత్‌ (21) పరుగులు చేయగా మెయిన్‌ అలీ (3/13)తో ఢిల్లీని కొలుకోలేని దెబ్బతీశాడు.

ఇక అంతకముందు బ్యాటింగ్ చేసిన చెన్నై…చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లకు 208 పరుగులు చేసింది. డెవా న్‌ కాన్వే (49 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 87) అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోగా రుతురాజ్‌ గైక్వాడ్‌ (41), శివమ్‌ దూబే (32), ధోనీ (8 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్సర్లతో 21 నాటౌట్‌) వేగంగా ఆడారు. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా డెవాన్‌ కాన్వే నిలిచాడు.

- Advertisement -