నౌకాదళ ఉద్యోగులకు చెక్‌..

247
check for navy employees
- Advertisement -

నౌకాదళ జవాన్లు, ఉద్యోగులకు ఉన్నతాధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. సబ్సీడీపై తక్కువ ధరకే లభిస్తుండడంతో నిత్యమూ ఫుల్‌గా తాగేస్తున్న నౌకాదళ జవాన్లు, ఉద్యోగులు బొజ్జలు పెంచేసి, సంతృప్తికరంగా విధులను నిర్వహించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఈ ఆరోపణలపై స్పందించిన ఉన్నతాధికారులు మోతాదుకు మించి మద్యం తాగుతున్న కారణంగా ఉద్యోగుల్లో ఊబకాయం, స్థూలకాయం సమస్యలు పెరిగాయన్న రిపోర్టులతో, అధిక బరువు, ఒబేసిటీతో ఉన్న వారికి సబ్సిడీపై మద్యాన్ని విక్రయించరాదన్న ఆదేశాలు జారీ చేశారు. కాగా..నావికా దళంలోని అన్ని స్థాయుల్లోని ఉద్యోగులకూ ఈ నిబంధన వర్తిస్తుందని నార్త్ వెస్ట్ రీజియన్ కమాండర్ రాకేష్ పాల్ వెల్లడించారు. బరువు తగ్గాలని మెడికల్ బోర్డు సూచించిన ప్రతి ఒక్కరికీ ఇకపై తక్కువ ధరకు మద్యం లభించదని ఆయన అన్నారు. వారు తిరిగి, తమ బరువును అదుపులోకి తెచ్చుకున్న తరువాత చౌక మద్యం సౌకర్యాన్ని కల్పిస్తామని తెలిపారు.

- Advertisement -