చెక్ డ్యాంల వలన భూగర్భ జలాల అభివృద్ధి…

284
- Advertisement -

చెక్ డ్యామ్‌ల నిర్మాణాలతో అధ్భూతమైన ఫలితాలను సాధిస్తున్న రాష్ట్ర రహదారులు మరియు భవనముల శాఖ, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఎంతో వినూత్నంగా రహదారులు మరియు భవనముల శాఖ చెక్ డ్యామ్-వంతెనల నిర్మాణాలను పెద్ద ఎత్తున చేపట్టింది. రహదార్ల అభివృద్ధిలో భాగంగా వంతెనలు, ఆయా వంతెనల నిర్మాణాలలో సాంకేతిక వేసులు బాట్లు ఉన్న ప్రాంతంలలో చెక్ డ్యాంతోపాటు వంతెనలను పెద్ద ఎత్తున చేపట్టింది. ఈ చెక్ డ్యాంల నిర్మాణం వలన ఆయా ప్రాంతాల భూగర్భ జలాల అభివృద్ధి, పశు పక్ష్యాదులు త్రాగునీటి సదుపాయం పర్యావరణ పరిరక్షణ వంటి అనేక ఉపయోగాలు నిబిడీకృతమై ఉన్నాయి.

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఎన్నో ప్రజోపయోగ కరమైన పనులలో ఈ చెక్-డ్యాంల నిర్మాణాలు అగ్రగామిగా నిలువగలవు. చెక్ డ్యామ్‌ల వలన కలిగే ఉపయోగాలు భవిష్యత్తరాల ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు రహదారులు మరియు భవనముల మంత్రిత్వ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు నేతృత్వంలో ముఖ్య మంత్రి కె.సి.ఆర్ సూచనల మేరకు నిర్విరామంగా కృషిసలుపుతున్నారు. నవసమాజ అభివృధికి, బంగారు తెలంగాణా సాధనకు రహదారుల కీలక పాత్రను గుర్తించిన ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర రావు నేతృత్వంలోని తెలంగాణా ప్రభుత్వం, తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావానంతరం రాష్ట్ర రహదారులు మరియు భవనముల శాఖ ఆధ్వర్యంలో షుమారు 14,000 కి.మీ నిడివి గల రహదారుల నిర్మాణం చేపట్టింది.

Check Dams Construction Across State

రాష్ట్ర మంత్రి తుమ్మల సౌజన్యంతో రాష్ట్ర రహదారులు మరియు భవనముల శాఖ ఈ రహదారుల నిర్మాణ కార్యక్రమాలను చేపట్టింది. ఈ బృహత్తర పధకంలో భాగంగా మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు, జిల్లా కేంద్రాల నుంచి రాష్ట్ర రాజధానికి మరియు ఇతర ముఖ్య పట్టణాలకు అనుసంధానంగా పలు రహదారులను అనుసంధానిస్తున్నారు. ఈ రహదారులలో ప్రస్తుతం ఉన్న ఒక వరుస నుండి రెండు వరుసలుగా లేదా రెండు వరుసల నుండి నాలుగు వరుసలుగా వెడల్పు చేయటం మరియు పటిష్ట పరచటం వంటి పనులను లక్ష్యంగా నిర్దేశించింది ప్రభుత్వం.

ఈ మహత్తర కార్యక్రమానికి షుమారు రూ. 18,000 కోట్ల అంచనాలతో ప్రణాళికలు ఏర్పాటు చేశారు రహదారులు మరియు భవనముల శాఖ విభాగం వారు. ఈ రహదారుల నిర్మాణంలో భాగంగా 532 వంతెనలను పటిష్టపరచటం లేదా పునర్నిర్మించటం చేస్తున్నారు ఆర్‌ అండ్‌ బీ శాఖ వారు. ఈ యొక్క వంతెనల నిర్మాణ అంచనా విలువ మొత్తం రూ.2,782 కోట్లు అని తెలిపారు మంత్రి తుమ్మల.

Minister Thummala Nageswara Rao

గౌరవ ముఖ్యమంత్రి సూచన 532 వంతెనల నిర్మాణంలో సాంకేతికంగా వెసులు బాటు ఉన్న ప్రాంతాలలో వంతెన-సేతువు (చెక్-డ్యాం)లను కూడా పొందుపరచారు ఆర్‌ అండ్‌ బీ విభాగం వారు. చెక్-డాంల ఆవశ్యకతను గుర్తించిన ప్రభుత్వం, వాటి డిజైన్ మరియు నిర్మాణ ప్రక్రియలో మెళకువలు అధ్యయనం చేయటానికి మహారాష్ట్ర కు ఒక ఉన్నత స్థాయి బృందాన్ని పంపింది. ఆ బృందం పలు వంతెనల నిర్మాణాలను పరిశీలించి 200 ప్రాంతాలలో చెక్-డ్యాంల నిర్మాణానికి అనుకూలంగా ఉన్నాయని నివేదికలు సమర్పించింది. వీటిలో నీటి లభ్యత 18695లక్షల లీటర్లగా అంచనా వేయడం అయింది.

వంతెనలకు ఎగువ దిశలో నీటి నిలువకు అనుకూలంగా ఉండే ప్రదేశాల ఎంపిక చాలా కీలకం. చెక్-డ్యాంల నిర్మాణంలో వంపులు లేని ప్రవాహ క్రమం, నీటి నిలువ పరిమాణం, వంతెన మరియు ఇరువైపులా ఉండే కట్టలు ముంపుకు గురి కాకుండా ఉండే విధంగా ఆకృతుల నిర్మాణం వంటి అంశాలు ప్రాధాన్యం కలిగి ఉంటాయి. ఈ చెక్-డ్యాంల నిర్మాణానంతరం పరిసర ప్రాంతాలలో భూగర్భజలాల పెరుగుదల మెరుగుపడినట్లు దాఖలాలు కనిపిస్తున్నాయి. పశుపక్ష్యాదుల తాగు నీటి కొరత ఎంతోకొంత మేర తీరుతున్నది. చెక్-డ్యాంనిర్మాణాలు ఒక ఉద్యమ స్పూర్తితో చేపడితే పచ్చదనం మెరుగుపడి ఆ ఫలాలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయి అని తెలిపిన మంత్రి తుమ్మల. మున్ముందు చెక్-డ్యాంతో కూడిన వంతెనలను హరిత నిర్మాణాలుగా రూపకల్పన చేసినట్లయితే గ్లోబల్ వార్మింగ్ వంటి సమస్యలు, కర్బన ఉద్గారాల తీవ్రత తగ్గి పర్యావరణానికి ముందు తరాలకు ఏంతో మేలు చేసినట్లు అవుతుంది.

Check Dams Construction Across State

చెక్-డ్యాం ప్రత్యేకతలు: నదులు లేదా వాగుల పరివాహక ప్రాంతాలలో చెక్-డాంలను వర్షపు నీటి సంరక్షణకు ఆనకట్టల మాదిరిగా ఉపయోగించుకోవటం సాధారణమే. అయితే వంతెనల నిర్మాణంలో చెక్-డ్యాంల ఏర్పాటు వినూత్న ప్రయోగమే అని చెప్పాలి. ముఖ్యమంత్రి సూచనల మేరకు ఈ చెక్-డ్యాంల రూపకల్పన జరిగింది. వంతెనల నిర్మాణక్రమంలో కేవలం 12% నుంచి 15% అదనపు ఖర్చుతో ఎటువంటి అదనపు వనరుల అవసరం లేకుండా చెక్-డ్యాంలను పొందుపరచవచ్చు. వారధుల కట్టడాలలో నదీ గర్భంలో బల్లపరుపుగా వేసే శ్లాబు నిర్మాణంపై ప్రవాహ దిశకు అడ్డంగా అంటే వంతెనకు సమాంతరంగా కేవలం రెండు లేదా మూడు వరుసల మేసనరి కట్టడం ద్వారా ఈ చెక్-డ్యాంలను నిర్మించుకోవచ్చు.

భూగర్భ జలాల పరిరక్షణ, పశుపక్ష్యాదుల తాగునీటి అవసరార్ధం, ఇతర నీటి వినియోగ అవసరాలకు ఏంతో ఉపయోగంగా ఉంటాయి ఈ చెక్-డ్యాంలు. పెద్ద నదులపై నిర్మించే ఆనకట్టల వలన కలిగే ముంపు, వన్య ప్రాణుల అంతరింపు వంటి అభ్యంతరాలు లేకుండా, చిన్న చిన్న మొత్తాలలో పలు ప్రాంతాలలో నీటి నిలువ సాధ్యపడుతుంది.మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ప్రత్యక్ష సారధ్యంలో నిరంతర సమీక్షలతో ఈ చెక్-డ్యాంల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చెక్-డ్యాంలు ప్రజల అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో రహదారులు మరియు భవనముల శాఖ అధికారులు కృషి చేస్తున్నారు అని తెలిపారు మంత్రి తుమ్మల.

- Advertisement -