చరిత్రపుటల్లో తెలంగాణ గ్రంథ ఆవిష్కరణ చేసిన కేటీఆర్‌

63
ktr book
- Advertisement -

దేశాన్ని నడిపించాలంటే కులం, మతం పేరుతో రాజకీయలు చేయడం సిగ్గు చేటు. దేశం పురోగమించాలంటే సెక్యులర్‌ భావాలతో ఎదగాలని రాష్ట్ర మున్సిపల్‌ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ కేంద్ర కార్యాలయంలో బుధవారం ప్రొఫెసర్ లక్ష్మణ్ సంపాదకత్వంలో వెలువరించిన ‘చరిత్రపుటల్లో తెలంగాణ’ గ్రంథాన్ని కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమి ఛైర్మన్ జూలూరు గౌరీశంకర్, గ్రంథ‌ రచయితలు ప్రొఫెస‌ర్ జీ లక్ష్మణ్, ప్రొఫెస‌ర్ మాదాడి వెంకటేశ్వరరావు, హైదరాబాద్ బుక్ ఫెయిర్ కార్యదర్శి కోయ చంద్రమోహన్ లు పాల్గొన్నారు.

అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధిస్తూ దూసుకుపోవాల్సిన సమయంలో కుల, మత ప్రస్తావనల్లో కొట్టుకపోతే అది దేశానికి తీవ్ర నష్టాన్ని చేకూర్చుతుందన్న ఆందోళనను వ్యక్తం చేశారు. ప్రపంచ చరిత్రలను అధ్యయనం చేస్తున్న విద్యార్థులు ప్రస్తుతం దేశంలో జరుగుతున్న అవాంఛనీయ సంఘటనలపై దృష్టి పెట్టాలన్నారు. దేశంలో మానవత్వంపై దాడి జరుగుతున్నప్పుడు, ఆలోచన పరులైన యువతరం స్పందించాలన్నారు. యువతరం చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం వుందని, లేకపోతే కులం, మతం పేరుతో కొట్లాడుకునే విష వలయాలలో చిక్కుకుంటామని తెలిపారు. దేశంలో ప్రస్తుతం మతం మత్తుమందులాగా తయారైందని, తెలంగాణ సమాజం యావత్తు జాగరూకతతో ఉండాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. మతం రాజకీయ పార్టీ ముసుగు వేసుకొని వస్తే అది దేశాన్ని గందరగోళ పరుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజాస్వామ్యంలో ప్రశ్నించేవారు పుడుతుంటారని, ప్రస్తుతం కేసీఆర్ ఎదురు తిరిగాడని, దేశమంతా ప్రశ్నించే గొంతులు పెరుగుతాయన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ చరిత్రను, పోరాటం జరిగిన విధానం, జరిగిన ఉద్యమాలు, ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమం, జాతరలు పండుగలు అనేకాంశాలను గ్రంథస్థం చేసిన ప్రొఫెసర్ లను అభినందించారు.

- Advertisement -