- Advertisement -
అక్కినేని హీరో అఖిల్ తాజాగా ‘మిస్టర్ మజ్ను’ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తుండగా.. ఈ సినిమా ఎక్కువ భాగం విదేశాల్లో చిత్రీకరించారు. సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్ర బృందం. అయితే ఈ మూవీ తర్వాత అఖిల్ 4వ సినిమా ఏ బ్యానర్లో .. ఏ దర్శకుడితో వుండనుందనేది ఆసక్తికరంగా మారింది.
ఈ నేపథ్యంలో అఖిల్ 4వ సినిమాకి బోయపాటి దర్శకుడిగా వ్యవహరించనున్నాడనీ, ఈ సినిమా చరణ్ సొంత బ్యానర్లో రూపొందనుందనే సమాచారం. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలోనే చరణ్ ‘వినయ విధేయ రామ’ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే దర్శకుడు బోయపాటి, హీరో రామ్ చరణ్ కలిసి అఖిల్కు సంబంధించిన సినిమాను సెట్ చేశారని సినీవర్గాల బోగట్టా.
- Advertisement -