మొక్కలునాటిన సినీ గేయ రచయిత చంద్రబోస్…

155
chandrabose
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా సినీ గేయ రచయితలు రామజోగయ్య శాస్త్రి, శ్రీమణి విసిరిన చాలెంజ్ స్వీకరించి మణికొండలోని తన నివాసంలో మొక్కలు నాటిన సినీ గేయ రచయిత చంద్రబోస్.

వృక్షో రక్షతి రక్షిత:అనే సిద్ధాంతాన్ని నమ్ముతానని ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన ఈ గ్రీన్ ఇండియా చాలెంజ్ చాలా మంచి కార్యక్రమమని చంద్రబోస్ అన్నారు.మన జీవితం,సమాజం ,భవిష్యత్ పచ్చగా ఉండాలంటే పచ్చని చెట్లే మూలాధారం అని అన్నారు.

అనంతరం ఈ గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగస్వామ్యం అవ్వాల్సిందిగా మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ మాలిక్ ,ప్లేబ్యాక్ సింగర్ ఎం.ఎం.శ్రీలేఖ ,సినీ దర్శకులు మున్నా ముగ్గురికి చంద్రబోస్ చాలెంజ్ విసిరారు.ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రతినిధి సుబ్బరాజు పాల్గొన్నారు.

- Advertisement -