కృష్ణంరాజు మృతిపై ప్రముఖుల దిగ్భ్రాంతి..

57
Krishnam
- Advertisement -

సీనియర్ నటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు ఇకలేరు. అనారోగ్యంతో ఇవాళ ఉదయం ఆయన మృతిచెందగా సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కృష్ణంరాజు మృతి బాధాకరమని ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

రెబల్ స్టార్ మరణం ఎంతో బాధ కలిగించిందని టీడీపీ అధినేత చంద్రబాబు తెలపగా విలక్షణ నటుడుగానే కాకుండా కేంద్రమంత్రిగా పనిచేసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

కృష్ణంరాజు మరణం సినిమా పరిశ్రమతో పాటు భారతీయ జనతా పార్టీకి తీరని లోటని ఆ పార్టీ ఏపీ ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఉభయగోదావరి జిల్లాల నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున కేంద్ర మంత్రిగా సేవలందించిన కృష్ణంరాజు మరణం దిగ్భ్రాంతిని కలిగించింది. ఆయన మృతి నన్ను కలచివేసింది. బీజేపీ అభివృద్ధిలో తనదైన ముద్ర వేసిన మహనీయుడు అని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంతాపం ప్రకటించారు.

- Advertisement -