దేశంలో రిచెస్ట్ సీఎంల జాబితాను విడుదల చేసింది అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్. నెంబర్ 1 స్థానంలో ఏపీ సీఎం చంద్రబాబు, నెంబర్ 7 స్థానంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు.
రూ.931 కోట్లు ఆస్తులతో అగ్రస్థానంలో ఉన్నారు చంద్రబాబు. రూ.332 కోట్లు ఆస్తులతో తర్వాతి పొజిషన్ లో అరుణాచల్ సీఎం పెమా ఖండ్ ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆస్తులు రూ.30 కోట్లుగా ఉన్నాయి.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రూ.15 లక్షల ఆస్తులతో అత్యంత పేద ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2021 సెప్టెంబర్లో భవానీపూర్ ఉప ఎన్నికలకు ముందు సమర్పించిన అఫిడవిట్ ప్రకారం, ఆమె దగ్గర రూ.69,255 నగదు, రూ.13.5 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, ఇందులో ఎన్నికల ఖర్చుల కోసం రూ.1.5 లక్షలు కూడా ఉన్నాయి. ఆమె ఆస్తులలో 9 గ్రాముల బంగారు ఆభరణాలు, దాదాపు రూ.43,837 విలువైనవి, ఉన్నాయి. ఈ నివేదిక డిసెంబర్ 2024 తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, ఉప ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రులు సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా రూపొందించినది.
Also Read:అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం..

