రాష్ట్రంలో ఉపాధి పనులపై కేంద్ర బృందం హర్షం

162
errabelli
- Advertisement -

రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని హైదరాబాద్ లోని ఆయన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు రాష్ట్రంలో ఉపాధి హామీ పనుల పరిశీలనకు వచ్చిన కేంద్ర అధికారుల బృందం. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లోయపల్లి, ఆరుట్ల, ఇబ్రహీం పట్నం, పోల్కం పల్లి, రాయ పోల్ తదితర గ్రామాలలో ఉపాధి హమీ పనులను పరిశీలించింది కేంద్ర బృందం.

ఉపాధి హామీ పనుల మస్టర్ రోల్, కూలీల పనుల నిర్వహణ, పనుల నాణ్యత వంటి అంశాలను పరిశీలించింది. అలాగే పల్లె ప్రగతి కింద ఉపాధి హామి తో అనుసంధానించి, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వైకుంఠ దామాలు, డంపింగ్ యార్డులు, నర్సరీ లు, పల్లె ప్రకృతి వనాలు, రొడ్లకిరువైపుల మొక్కలు, సీసీ రోడ్లను పరిశీలించి అభినందించింది కేంద్ర బృందం.

దేశంలోనే ఎక్కడా లేని విధంగా, తెలంగాణలో అద్భుతంగా ఉపాధి హమీ, అనుబంధ పనులు జరుగుతున్నాయని మంత్రి ఎర్రబెల్లి కి చెప్పి,అభినందించింది కేంద్ర బృందం. రూ.780 కోట్ల ఉపాధి హామీ నిధుల్లో, రూ.199 కోట్లు విడుదల చేసినట్లు ప్రకటించింది. మరో రెండు మూడు రోజుల్లో రూ. 143 కోట్లు విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.

ఉపాధి హామీ పనులు ఎంత చేయగలిగితే, అంత వరకు అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఉపాధి హామీ తో, వ్యవసాయ అనుబంధానికి మరికొంత సమయం పడుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కి వివరించింది కేంద్ర బృందం. అలాగే మిషన్ భగీరథ పనులను పరిశీలించి, అభినందించింది కేంద్ర బృందం. కేంద్ర బృందంలో, ఉపాధి హామీ పథకం జాయింట్ సెక్రటరీ రోహిత్ కుమార్, జాయింట్ డైరెక్టర్ అమరేందర్ ప్రతాప్ సింగ్, కన్సల్టెంట్ కిరణ్ కుమార్ పాండే తదితరులు ఉన్నారు.

- Advertisement -