కేంద్ర అంతర్ మంత్రిత్వ శాఖల అధికారుల బృందం సోమవారం సాయంత్రం గాంధీ హాస్పిటల్ను సందర్శించింది.ఈ సందర్భంగా ప్రిన్సిపల్,ఇతర విభాగాల వైద్యాధికారులతో సమావేశమైంది. పాజిటివ్ కేసులకు అందిస్తున్న వైద్యసేవలు, వసతులు, అందుబాటులో ఉన్న శానిటేషన్సి, పారామెడికల్, సిబ్బంది, సెక్యూరిటీ, వార్డు బాయ్స్ పనితీరు, పిపిఈ లు మెడిసిన్స్ లభ్యత వివరాలు తెలుసుకున్నారు. గాంధీ హాస్పిటల్లో ఉన్న బెడ్స్, ఐసియు బెడ్స్, వెంటిలేటర్లు తదితర అంశాలను వాకబు చేశారు. వైద్యులు, ఇతర సిబ్బంది తీసుకుంటున్న జాగ్రత్తలను అడిగారు.
ఈ సందర్బంగా అధికారులు మాట్లాడుతూ చికిత్స పొందుతున్న కేసులలో 90% మంది ఆరోగ్య స్థితి నార్మల్ గానే ఉన్నట్లు వివరించారు. సిబ్బంది కొరత లేదని తెలిపారు. అనంతరం గాంధీ హాస్పిటల్లో ఏర్పాటుచేసిన కోవిడ్-19 ప్రత్యేక వార్డును తనిఖీ చేశారు. వైద్యులు, వైద్య సిబ్బంది అందిస్తున్న సేవలను ప్రశంసించింది. ఇక్కడ అందిస్తున్న సేవలు ఇతర ప్రాంతాలకు ఆదర్శంగా నిలుస్తాయని అభిప్రాయపడినారు.