జాబిల్లి టీం రెడీ…

162
- Advertisement -

విహారయాత్ర చేయడానికి సర్వం సిద్దం చేసుకొని చివరి క్షణాల్లో రద్ధు చేసుకోంటే ఎలా ఉంటుందో అది మాటల్లో వర్ణించలేము. కానీ రాత్రిళ్లు తెల్లటి వెన్నెముద్దలా కనిపించే జాబిల్లి మీదికి విహారయాత్రకు అంటే ఠక్కున గంతేస్తాం. ఎందుకంటే అది ఒక కలల ప్రాజెక్ట్‌. అయితే స్పేస్ ఎక్స్ అనే సంస్థ అంతరిక్షయాత్రను మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఇందుకోసం 8టికెట్లను అమ్మకానికి పెట్టిన సదరు సంస్థ….టికెట్లను మొత్తం జపాన్‌కు చెందిన యుసాకూ మయేజావా కొనుగోలు చేశారు.

వచ్చే యేడాది చంద్రమండలం యాత్ర జరగనున్నదని అయితే ఆ యాత్ర కోసం ఎవరెవరిని ఎంపిక చేశారో తెలుసా… చంద్రమండల యాత్ర కోసం 2021 మార్చిలో మయేజావా తన సహయాత్రికుల కోసం ఆన్వేషణ మొదలుపెట్టారు. కొరియన్ పాప్ గ్రూప్ బిగ్ బ్యాంగ్ లీడ్ సింగర్‌గా రంగప్రవేశం చేసిన చోయి స్యూంగ్‌ హ్యూన్ అలియాస్ టాప్ తో పాటుగా అమెరికా డీజే స్టీవ్‌ ఆవకీ సినీ దర్శకుడు బ్రెండాన్ హాల్ యూట్యూబర్ టిమ్ డాడ్‌ను మయేజావా తన టీమ్‌లో చేర్చుకొన్నారు. బ్రిటీష్ ఫోటోగ్రాఫర్‌ కరీమ్ ఇలియా జెక్ చిత్రకారుడు యేమీ ఏడీ ఐరిష్ ఫోటో గ్రాఫర్ రియానన్ ఆడమ్‌లనూ ఎంపిక చేసుకొన్నారు.

అమెరికాకు చెందిన ఒలంపిక్ స్నోబోర్డర్ కైత్లిన్ ఫారింగ్టన్ జపనీస్‌ డ్యాన్సర్‌ మియూలను బ్యాకప్ కింద ఎంపిక చేశారు. ప్రస్తుతం ఈ జాబితాను చూసిన వాళ్లంతా అక్కడ షార్ట్‌ఫిలిమ్స్ షూటింగ్‌కు ప్రణాళిక రెడీ చేసుకోన్నారని పలువురు అంతర్జాతీయ వాణిజ్య నిపుణులు, మరియు జపాన్‌కు చెందిన సినిమా క్రిటిక్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి…

సంబురాల సంక్రాంతికి 4233బస్సులు….

కారు రేసింగ్…ట్రాఫిక్ ఆంక్షలు

లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్…

- Advertisement -