పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి..

35
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా జూబ్లీహిల్స్ జిఎచెంసి పార్క్ లో ఈరోజు అహంప్రాణ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ప్రవీణ్ కుమార్ తంగేళ్ల మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని అన్నారు.

వాతావరణ కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని ముఖ్యంగా యువత ముందుకు రావాలని కోరారు. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్‌కు ప్రవీణ్ కృతజ్ఞతలు తెలియజేశారు.అనంతరం తన స్నేహితులు ఇంద్ర,జానీ మాస్టర్,విష్ణు ప్రియ ముగ్గురికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు.

- Advertisement -