Ram Mandir:అయోధ్యకు తరలిన సినీ ప్రముఖులు

19
- Advertisement -

అయోధ్య శ్రీరాముడి విగ్రహానికి మరికాసేపట్లో ప్రాణ ప్రతిష్ట జరగనుంది. ఈ మహోత్తర వేడుకకు ప్రపంచ దేశాల నుండే కాకుండా దేశ వ్యాప్తంగా సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. శ్రీరామ నామ స్మరణతో అయోధ్య ప్రాంగణం మార్మోగిపోతోంది.

ఇక భారతీయ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఈ మహోత్తర వేడుకకు అతిథులుగా హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, రజినీకాంత్, అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, విక్కీ కౌశల్, కత్రినా కైఫ్, అలియా భట్, రణబీర్ కపూర్, జాకీ ష్రాఫ్, కంగనా, మధుర్ బండార్కర్, రాజ్ కుమార్ హిరానీ, రోహిత్ శెట్టి, వివేక్ ఒబెరాయ్, అనుపమ్ ఖేర్ ఇలా వందల సంఖ్యలో ప్రముఖులు చేరుకున్నారు.

సినీ, క్రీడా, వ్యాపార, రాజకీయ ప్రముఖులు రావడంతో ఇప్పటికే అయోధ్య ఎయిర్ పోర్ట్ లో ప్రైవేట్ చార్టర్డ్ విమానాలతో నిండిపోయింది. ఇక వీవీఐపీలు రావడంతో అయోథ్యం మొత్తం పోలీస్ పహారాతో నిండిపోయింది.

Also Read:పిక్ టాక్ : డస్కీ సొగసుతో అందాల దాడి

- Advertisement -