సీసీసీ….అప్‌డేట్స్‌ ఇవే..!

331
ccc
- Advertisement -

కరోనా మహమ్మారితో సినీ కార్మికులను ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి సీసీసీ(కరోనా క్రైసిస్ ఛారిటీ)ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీనికి ఛైర్మన్‌గా ఉన్న చిరంజీవి తనవంతుగా కోటి రూపాయలను విరాళంగా ఇవ్వగా మిగితా హీరోలు సైతం తమవంతు సాయాన్ని అందిస్తున్నారు.

మార్చి 28న ఏర్పాటైన సీసీసీకి ఇప్పటివరకు రూ.6.2 కోట్ల విరాళాలు అందాయని చిరంజీవి వెల్లడించారు. విరాళాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన చిరు…ప్రతి ఒక్కరు ఆదుకోవడానికి ముందుకు రావాలన్నారు.

ఇప్పటివరకు నాగార్జున‌, ర‌వితేజ‌, ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్, నాగ చైత‌న్య‌,ప్రభాస్,సందీప్ కిషన్,నారా రోహిత్,పలువురు నిర్మాతలు తమవంతు సాయాన్ని అందించారు. హీరోయిన్లలో లావణ్య త్రిపాఠి స్పందించి విరాళాన్ని ఇచ్చారు.

- Advertisement -