జనసేనలో చేరిన జేడీ లక్ష్మీనారాయణ..

208
jd laxmi narayana
- Advertisement -

సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్, మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ జనసేనలో చేరారు. పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ కండువ కప్పి లక్ష్మీనారాయణను జనసేనలోకి ఆహ్వానించారు. కొన్ని రోజుల క్రితం ఆయన అధికార టీడీపీలో చేరుతారని వార్తలు రాగా, వాటిని లక్ష్మీనారాయణే స్వయంగా ఖండించిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ ఆయనకు భీమిలి టికెట్‌ను కూడా ఖరారు చేసిందని వార్తలు వెల్లువడ్డాయి. ఈ నేపథ్యంలో జేడీ లక్ష్మీనారాయణ జనసేనలో చేరడం చర్చాంశనీయంగా మారింది.

అనంతరం లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. మంచి జ్ఞాన సంపద, ధైర్యం, ప్రజాధరణ.. ఈ మూడు లక్షణాలు ఉన్న వ్యక్తి పవన్‌ కల్యాణ్‌ అని కొనియాడారు. ప్రజల కోసం, ప్రజాసేవలో పనిచేస్తున్న పవన్‌ పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. జనసైనికుల్లో తాను కూడా ఒకడిగా మారిపోయానని తెలిపారు. పవన్‌ మార్గదర్శకత్వంలో మనమంతా ముందుకువెళ్తూ.. ప్రజలు మనపై పెట్టుకున్న ఆశలను మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తామన్నారు. ‘ మనం ముందుకెళ్దాం.. దేశాన్ని మారుద్దాం.. జనసేన అంటే ఎంటో చూపిద్దాం’ అంటూ లక్ష్మీనారాయణ నినదించారు. తనకు పార్టీలో అవకాశం కల్పించినందుకు పవన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

 

- Advertisement -