దిగొచ్చిన బైజూస్..

18
- Advertisement -

ఎట్టకేలకు బైజూస్ యాజమాన్యం దిగొచ్చింది. ఉద్యోగులకు చెల్లించాల్సిన జనవరి నెల జీతాలు చెల్లించింది. ఈ మేరకు బైజూస్‌ వ్యవస్థాపకుడు రవీంద్రన్ ఉద్యోగులకు లేఖ రాశారు. సోమవారం వరకు వేతనాలు అందుతాయని తెలిపారు.

ష్టసమయంలో కంపెనీకి మద్దతుగా ఉన్నందుకు, జీతాల కోసం ఓపికతో ఎదురుచూసినందుకు ఉద్యోగులకు ఈ సందర్భంగా రవీంద్రన్‌ కృతజ్ఞతలు తెలిపారు.కొన్ని నెలలుగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. మీరు న్యాయంగా చట్టబద్ధమైన వేతనాన్ని పొందేందుకు ఈ సారి నేను మరింత ఎక్కువగా పోరాడాల్సి వచ్చిందని తెలిపారు. ఈ యుద్ధంలో అందరూ అలసిపోయారు కానీ ఎవరూ వెనకడుగు మాత్రం వేయలేదు అన్నారు.

Also Read:Pawan: పవన్ వెనక్కి తగ్గినట్లేనా?

- Advertisement -