బై బై.. మహా గణేశా

54
- Advertisement -

ఖైరతాబాద్ గణనాథుడు గంగమ్మ ఒడికి చేరాడు. నవరాత్రుల పాటు భక్తుల ప్రత్యేక పూజలందుకున్న గౌరీ తనయుడు గంగమ్మ ఒడికి చేరాడు. 63 అడుగుల ఎత్తు, 40 ట‌న్నుల బ‌రువున్న ఈ విగ్ర‌హ నిమ‌జ్జ‌నానికి భ‌క్తులు భారీ సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చారు. మ‌ధ్యాహ్నం 1:30 గంట‌ల స‌మ‌యంలో ఖైర‌తాబాద్ గ‌ణ‌నాథుడు గంగ‌మ్మ ఒడికి చేరాడు.

నిమజ్జనం సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గ‌ణ‌నాథుడి నిమ‌జ్జ‌న ప్ర‌క్రియ‌కు ఇసుకెస్తే రాల‌నంత జ‌నం వ‌చ్చారు. మహాగణపతి శోభయాత్ర ఖైరతాబాద్‌ నుంచి టెలిఫోన్‌ భవన్‌ మీదుగా డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర స‌చివాల‌యం ముందు నుంచి హుస్సేన్‌సాగర్‌ వరకు సాగింది. ఇక్కడ చివరిసారిగా నిర్వాహకులు మహాగణపతికి పూజలు నిర్వహించారు.

శోభాయాత్ర కొనసాగే మార్గాలలో ట్రాఫిక్‌ మళ్లించారు. ప్రధాన రహదారులతో పాటు వీధుల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు.

Also Read:ఇది యాపారం.. కాంగ్రెస్ లో ఇంతే?

- Advertisement -