మొక్కలు నాటిన పారిశ్రామికవేత్త బివిఆర్ మోహన్ రెడ్డి

415
bvr
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం ఉద్యమంలా సాగుతుంది. ఈ గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి విసిరిన సవాల్ ను స్వీకరించారు ప్రముఖ పారిశ్రామిక వేత్త బివిఆర్  మోహన్ రెడ్డి. హైదరాబాద్ లోని సియాంట్ క్యాంపస్ లో మూడు మొక్కలు నాటారు.

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం అద్భతం అన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ సంతోష్ కుమార్ కు అభినందనలు తెలిపారు. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గోని మొక్కలు నాటాలని కోరారు.

- Advertisement -