భారత స్టార్ బౌలర్ జస్పిత్ బుమ్రా పాయింట్ పీల్డర్ అయ్యారు. ఒకప్పుడు యూవరాజ్ సింగ్, మహ్మద్ కైఫ్, సురేశ్ రైనా, రవీంద్ర జడేజా వంటి అథ్లెటిక్ ఫీల్డర్లు రాణించిన పాయింట్ ఫీల్డింగ్ పాయింట్లో బుమ్రా కనిపించాడు. అంతేగాదు పాకిస్తాన్తో మ్యాచ్లో పాయింట్లోనే మొదటి బంతిని పట్టుకున్నాడు. సాయిం అయూబ్, కట్ షాట్ ఆడబోతూ, దాన్ని నేరుగా అతని చేతుల్లోకి పంపాడు. తన బౌలింగ్ కోణాలతో కెరీర్ను నిర్మించుకున్న బుమ్రా, ఈ సారి ఆ కోణం నుంచే క్యాచర్ అయ్యాడు.
రెండు రోజుల తర్వాత, దుబాయ్లోని ఐసీసీ క్రికెట్ అకాడమీ వద్ద ఆ క్షణం మళ్లీ తలెత్తింది. ప్రాక్టీస్ సమయంలో, ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్ అతన్ని ఒక డ్రిల్ కోసం పిలిచాడు. బుమ్రా సరదాగా నిరాకరిస్తూ..”అబ్ తో పాయింట్ కా ఫీల్డర్ హో గయా హూన్ మై!” (ఇప్పుడు నేను పాయింట్ ఫీల్డర్ అయ్యాను!) అన్నాడు.
మంగళవారం ఫీల్డింగ్ నైపుణ్యాలు పదును పెట్టే ముందు, బుమ్రా సంజూ సామ్సన్కు బౌలింగ్ చేశాడు. తన రన్-అప్ని క్రమంగా పొడిగిస్తూ, చివరకు పూర్తి చేశాడు. ఈసారి సాధారణంగా చివర్లో బ్యాటింగ్ చేసే సామ్సన్ ముందుగానే దిగాడు. అతని సెషన్ చిన్నదే కానీ బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. రింకు సింగ్, అక్షర్ పటేల్, జితేష్ శర్మ, తిలక్ వర్మ 60 మీటర్ల స్ప్రింట్లు పూర్తి చేసి, దుబాయ్ వేడి, తేమను తట్టుకోలేక చొక్కాలు విప్పేశారు.
ఇక బుమ్రా UAEతో మ్యాచ్లో, 2016 తర్వాత తొలిసారి, అతను పవర్ప్లేలో మూడు ఓవర్లు వేసాడు. పాకిస్తాన్తోనూ అదే రీతిగా మూడు ఓవర్లు వేశాడు. ఇంతవరకు, మేము ఎక్కువగా అతనితో రెండు ఓవర్లు మాత్రమే పవర్ప్లేలో వేయించాం. ఇటీవల మూడు వేసిన సందర్భం లేదు అని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అన్నారు. ఇప్పుడు మేము అతన్ని దూకుడైన ఆప్షన్గా వాడుతున్నాం… రెండు వికెట్లు తీసినా, గట్టి మూడు ఓవర్లు వేస్తే కూడా తర్వాత స్పిన్నర్లకు సులభం అవుతుంది అన్నారు.
Also Read:‘తెలుసు కదా’..షూటింగ్ పూర్తి

