ఇంగ్లాండ్‌తో టెస్టు…కెప్టెన్‌గా బుమ్రా

54
bumra
- Advertisement -

ఇంగ్లండ్‌తో కీలకమైన ఐదో టెస్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యారు స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా. రోహిత్ శర్మకు కరోనా పాజిటివ్ రావడంతో బుమ్రా వైపు మొగ్గుచూపింది బీసీసీఐ. గతంలో కరోనా వైరస్‌ విజృంభణ కారణంగా వాయిదాపడ్డ ఐదో టెస్టు వచ్చే నెల 1 నుంచి బర్మింగ్‌హామ్‌ వేదికగా మొదలుకానుంది.


35 ఏండ్ల(1987లో) తర్వాత కపిల్‌దేవ్‌ తదనంతరం టెస్టుల్లో భారత్‌కు సారథ్యం వహించనున్న కెప్టెన్‌గా బుమ్రా అరుదైన ఘనత సొంతం చేసుకోనున్నాడు.
రోహిత్‌, రాహుల్‌ గైర్హాజరీతో చతేశ్వర్‌ పుజారా, శుభ్‌మన్‌ గిల్‌ ఓపెనింగ్‌ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కోహ్లీ, అయ్యర్‌, విహారి, పంత్‌తో బ్యాటింగ్‌ లైనప్‌ బరిలోకి దిగనుండగా, బుమ్రా, షమీ, సిరాజ్‌తో పాటు అశ్విన్‌, జడేజాలో ఒక్కరిని తీసుకునే చాన్స్‌ ఉంది.


టెస్టు మ్యాచ్ అనంతరం వన్డే, టీ20ల్లో ఇంగ్లాండ్‌తో తలపడనుంది భారత్.

- Advertisement -