మొక్కలు నాటిన బీఆర్ఎస్‌కేవీ రూప్ సింగ్

36
- Advertisement -

బీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ స్థాపించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ జోరుగా కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్‌కేవీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎల్.రూప్ సింగ్‌ పాల్గొన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా జూబ్లీహిల్స్ లోని పార్క్‌లో మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ…సమైక్య పాలనలో పూర్తి స్థాయిలో విధ్వంసం అయిన అడవులను పరిరక్షించే బాధ్యతను చేపట్టిన ఎంపీ సంతోష్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణను హరితహారంగా చేయడం గొప్ప విషయమన్నారు. ఇవి భావితరాలకు ప్రాణ వాయువును అందించే గొప్ప కార్యక్రమమని ఇలాంటి కార్యక్రమాన్ని స్పూర్తిగా తీసుకొని ప్రపంచమంతా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

Also Read: TSPSC:పరీక్షల నెలగా మే…!

ఈ కార్యక్రమంలో వీవోఏ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు మాధవి ఆర్పీ అధ్యక్షురాలు సునీత బీహెచ్‌ఈఎల్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నవీన్ సీఏబీఎస్ డ్రైవర్ల సంఘం అధ్యక్షుడు సంతోష్‌రెడ్డి ఓయూ జేఏసీ నేతలు డాక్టర్ బి. సంజీవ్ నాయక్, డాక్టర్ రవీందర్ నాయక్ ,జాహెరా, స్వర్ణలత, కోటేశ్వర్, మొహేనోద్దీన్, నరసింహా వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Also Read: KTR:తెలంగాణ దేశానికే రోల్ మోడల్

- Advertisement -